Wednesday, May 1, 2024

బీజేపీలో చేరిన హేమ

సినీ నటి హేమ కాషాయ కండువా కప్పుకున్నారు. నెల్లూరు సభ వేదికగా బీజేపీలో చేరారు. సినిమాల్లో కూడా హేమ కనిపించడంలలేదు..అవకాశాలు కూడా తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సడన్‌గా హేమ బీజేపీ వేదికపై ప్రత్యక్షమై కమలం కండువా కప్పుకుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు నవ్వులు పూయించాయి. ఇలా కండువా కప్పుకుందో లేదో.. అప్పుడే ఫుల్‌ కామెడీ పండించింది. ఏదో మాట్లాడుదామని ఇంకేదో మాట్లాడి నెటిజన్లకు బుక్కైంది. వెండితెరపై నవ్వులు పూయించిన అలవాటు ఎక్కడికి పోతుంది. పొలిటికల్‌ వేదికపై కూడా అదే కంటిన్యూ చేసింది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా సరిగ్గా పలకక పోవడం, తర్వాత దాన్ని కవర్ చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభికుల్లో నవ్వులు తెప్పించాయి. ఇదిలా ఉంటే, తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికా.. లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా ఆమెకు క్లారిటీ లేకుండా పోయింది. అంతేగాక సభలో ఆమె వకీల్ సాబ్ సినిమా గురించి ప్రస్తావించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోదీ గురించి మర్చిపోయారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న బీజేపీ నేత… మోదీ గురించి మాట్లాడాలని చెవిలో చెప్పారు. అప్పుడు ఆమె ప్రధాని మోదీ కార్యక్రమాల గురించి ఏకరువు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement