Friday, May 3, 2024

ముంబైలో హై టెన్షన్…. బిగ్ బి, ధ‌ర్మేంద్ర‌, అంబానీల‌కు బాంబు బెదిరింపు కాల్స్..

ముంబై – బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర . ముఖేష్ అంబానీ ల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్‌పుర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు వెల్లడించారు. సమాచారం ప్రకారం అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్ప‌టికే ఉగ్ర‌వాది మెమెన్ అనుచ‌రులు ముంబైలో సంచ‌రిస్తున్నార‌నే వార్త‌లు నేప‌థ్యంలో వాణిజ్య మ‌హాన‌గ‌రంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement