Wednesday, May 1, 2024

Kupwara : ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జిల్లాలోని జుమాగండ్‌ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement