Thursday, April 25, 2024

Hyd | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న తోట‌..

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) బీఆర్ ఎస్ ఏపీ అధ్య‌క్ష‌డు తోట చంద్ర‌శేఖ‌ర్ మొక్క‌లు నాటారు. ఆయ‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో మొక్క‌లు నాటిన నీరు పోశారు. రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు అయిన‌ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్టు తోట చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు, ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండుగుల రామకృష్ణ, సోషల్ మీడియా మోహన్ నాయక్, ముప్పురి కుమార్, వనిల్ కుమార్, రజిని కుమార్ , రవి చంద్రశేఖర్ , తోట సత్యనారాయణ, తోట అనిరుద్ పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement