Monday, April 29, 2024

తెలంగాణ‌లో 359కిలోమీట‌ర్లు న‌డ‌వ‌నున్న రాహుల్ గాంధీ-రూట్ మ్యాప్ ఇదే

ఈ నెల 24నుండి తెలంగాణ‌లో కాంగ్రెస్ కీల‌క‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఈరోజు హైదరాబాద్ లోని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాసంలో భారత్ జోడో యాత్ర గురించి చర్చించారు. అనంతరం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు. ఈ యాత్ర తెలంగాణలో మొత్తం 13 రోజులకు కుదించారు. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. 13 రోజులపాటు రోజువారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితాని సిద్ధం చేశారు. ఈ పాదయాత్ర మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండలం, కృష్ణ గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానుంది.

1వ రోజు మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గంలో నేతలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 2వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 3వ రోజు మహబూబ్ న‌గ‌ర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని యాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 4 వ రోజు జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో రాహుల్ పాదయాత్రలొ నాగర్ కర్నూల్, ఖమ్మం లోక్ స‌భ‌లోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. 5 వ రోజు షాద్ న‌గ‌ర్ నియోజకవర్గంలోని పాదయాత్రలో మహేశ్వరం, భువనగిరి లోక్సభలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు. 6 వ రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ స‌భ‌ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement