Sunday, April 28, 2024

చోరి చేసి కాళ్లు మొక్కిన దొంగలు..

దొంగతానాకి వెళ్లిన ఎవరైన..ఎన్ని అడ్డంకులు ఎదురైన అనుకున్నది దోచుకొని బయటపడుతారు. మధ్యలో ఎవరైన అడ్డు వస్తే కత్తి చూపించి బెదిరిస్తారు. అవసరమయితే చంపడానికి కూడా వెనకాడరు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్తారు.  కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు.  బెదిరించి దొచుకున్న డ‌బ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజ‌మాని కాళ్ల‌కు మొక్కార‌ట‌.  అంతేకాదు, తీసుకున్న డ‌బ్బులను ఆరునెల‌ల లోగా తిరిగి ఇస్తామ‌ని చెప్పి వెళ్లార‌ట‌.  వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి య‌జ‌మానికి ఇచ్చి వెళ్లార‌ట‌.  ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో జ‌రిగింది.  ఘ‌జియాబాద్‌లోని రాజ్‌న‌గ‌ర్ లో నివ‌శిస్తున్న సురేంద్ర‌వ‌ర్మ ఇంట్లో జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ దొంగలు అలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది.

ఇది కూడా చదవండి: సరదాకి డీఎన్ఏ టెస్టు చేయించిన తండ్రి..విషయం తెలిసి షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement