Sunday, April 28, 2024

మగాళ్ల‌తో మాట్లాడొదన్నందుకు తల్లికే స్పాట్ పెట్టిన యువతి.. కిరాతకంగా చంపేసింది!

పక్కింటి మగ పిల్లలతో మాట్లాడొద్దు అన్నందుకు ఓ 17 ఏళ్ల అమ్మాయి ఏకంగా త‌న తల్లినే చంపేసింది. ఈ ఘాతుకం తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగింది. వన్నార్ ప్రాంతంలో జరిగిన ఈ మర్డర్ గురించి ముందుగా పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి చూసిన వారు షాక్‌కి గురయ్యారు. మునిలక్షి అనే వృద్ధురాలు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఆ డెడ్‌బాడీ పక్కనే 17 ఏళ్ల అమ్మాయి కూర్చుని ఉండడం పోలీసులు గమనించారు. అయితే ఆ యువతిని ప్రశ్నించగా.. పక్కింటి వాళ్లు చంపేశారని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. దీన్ని నమ్మని పోలీసులు మరిన్ని ప్రశ్నలు అడగడంతో అసలు విషయం చెప్పేసింది.

తదుపరి విచారణలో తన ఇద్దరు మగ స్నేహితుల సహాయంతో తన తల్లిని చంపినట్టు ఆ యువతి ఒప్పుకుంది. అయితే.. భర్తతో విభేదాలు రావడంతో మునలక్ష్మి ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 17 ఏళ్ల అమ్మాయి, ఆమె చెల్లెలు, ఒక తమ్ముడు వారి తండ్రితో నివసిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది అబ్బాయిలతో ఈ యువతి మాట్లాడినందుకు మునిలక్ష్మి అమ్మాయిని దూషించిందని, కొట్టిందని తెలిసింది. కాగా, హత్యలో పట్టుబడిన ఇద్దరు నిందితులు బాలిక తమకు ఫోన్ చేసి హత్యకు పథకం పన్నినట్లు ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement