Thursday, March 28, 2024

చిత్రా రామకృష్ణకు ఏప్రిల్ 11 దాకా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కో-లొకేషన్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 11 వరకు పొడిగించింది.అప్పటి ఎన్‌ఎస్‌ఇ బాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించడంతో చిత్రా రామకృష్ణను సీబీఐ మార్చి 6న అరెస్టు చేసింది. కాగా, చిత్రా 2013, 2016 మధ్య NSE CEO గా పనిచేశారు. ఆమె ఎన్‌ఎస్‌ఇకి సంబంధించిన రహస్య సమాచారాన్ని “హిమాలయాల్లో నివసించే యోగి”తో ఇమెయిల్ ద్వారా పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ “యోగి” నిజానికి ఈ నెల ప్రారంభంలో ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, రామకృష్ణ సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యం అని అనుమానిస్తున్నారు. చిత్రా రామకృష్ణ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సహ నిందితుడు ఆనంద్ సుబ్రమణ్యం బెయిల్ పిటిషన్‌ను కోర్టు గత వారం తిరస్కరించింది. మార్కెట్‌ ఎక్స్ఛేంజీల కంప్యూటర్‌ సర్వర్‌ల నుంచి స్టాక్‌ బ్రోకర్లకు సమాచారం సరిగా అందకపోవడంపై సీబీఐ విచారణ జరుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement