Wednesday, May 1, 2024

ఐపీఎల్ మొదటి మ్యాచ్ డౌటే..? స్టేడియం సిబ్బందికి కరోనా పాజిటివ్

క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఐపీఎల్ మ్యాచ్ లు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ చెన్నై, ఢిల్లీ ల మధ్య జరగబోతోంది. మరోవైపు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులునమోదవుతున్నాయి. కాగా రొండో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో సిబ్బంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారందరినీ కూడా ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

దీంతో ప్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 10న జరిగే మొదటి మ్యాచ్ జరపాలా? వద్దా? అనే సందిగ్ధంలో బిసిసిఐ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కూడా విపరీతంగా కరోనా పాజిటివ్ పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement