Sunday, May 5, 2024

Breaking: వన్డే మ్యాచ్​లో సఫారీల విజయం.. పోరాడి ఓడిన టీమిండియా కుర్రాళ్లు!

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్​లో టీమిండియా చతికిలపడింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత వర్షం అడ్డంకిగా మారింది. అయితే సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టడంతో 50 ఓవర్ల మ్యాచ్​ని 40 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఇక.. టాస్​ గెలిచి బౌలింగ్​ తీసుకున్న భారత జట్టు సఫారీల బ్యాటింగ్​ను అడ్డుకోలేకపోయింది. తొలుత టఫటఫా వికెట్లు పడేసుకున్న సఫారీలు ఆ తర్వాత నిలకడగా ఆడుతూ రాణించారు. దీంతో 40 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 249 పరుగులు చేశారు.

ఇక.. సెకండ్​ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన టీమిండియా కుర్రాళ్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. దీంతో కెప్టెన్​ శిఖర్​ధావన్​ (4), శుబ్​మన్​గిల్​ (3), రుతురాజ్​ గైక్వాడ్​ (19), ఇషాన్​ కిషాన్​ (20) పరుగులు మాత్రమే చేశారు. ఇక.. కాస్త మెరుగైన ఆటతీరు కనబరిచిన శ్రేయస్​ అయ్యర్​ (50) పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. దీంతో తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా చిక్కుల్లో పడింది. . ఇక.. సంజు శాంసన్ 86​, శార్దూల్​ ఠాకూర్​ కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ క్రమంలో 37వ ఓవర్​లో శార్దూల్ (33)​ పరుగుల వద్ద క్యాచ్​ అవుట్​ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్​ యాదవ్​ (0) డక్​ అవుటయ్యాడు. ఇక మొత్తం ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీమిండియా సఫారీల చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement