Tuesday, May 7, 2024

HYD : హోమ్‌వర్క్‌ చేయలేదని పలకతో కొట్టిన టీచర్‌.. విద్యార్థి మృతి

రామంతాపూర్: హోమ్‌వర్క్ చేయలేదని బాలుడిని టీచర్ పలకతో కొట్టడంతో విద్యార్థి చనిపోయిన ఘటన హైదరాబాద్‌ రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌లో చోటుచేసుకుంది. హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందారు.

శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఇవాళ హేమంత్ మృతిచెందాడు. అయితే హేమంత్ కుమార్ తలపై టీచర్ కొట్టడం వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. హేమంత్ కుమార్ మృతదేహంతో ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరేంట్స్ ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement