Friday, May 17, 2024

టాలీవుడ్ లో ముగిసిన సమ్మె.. రేపటి నుంచి షూటింగులకు హాజరుకానున్న కార్మికులు..

ఎట్టకేలకు టాలీవుడ్ లో సినీ కార్మికులు చేప‌ట్టిన సమ్మెను విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీతో చర్చించి వేతనాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో, సమ్మెను విరమిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులంతా యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement