Friday, May 17, 2024

Draupadi Murmu | హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగ‌తం ప‌లికిన గ‌వ‌ర్న‌ర్, సీఎం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో.. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క, అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement