Sunday, April 28, 2024

చైన్ స్నాచింగ్‎లపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

ఇటీవల కాలంలో హైదరాబాద్‎లో వరుస చైన్ స్నాచింగ్‎లు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను ఢిల్లీలో గుర్తించారు. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు హస్తినకు వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో కేటుగాళ్లను పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులు పంకజ్, మంగళ్, దీపక్, సెహ్వాగ్ లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అనంతరం కాజీపేట మీదుగా ఢిల్లీకి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement