Tuesday, April 23, 2024

అట్టహాసంగా మొదలైన సద్గురు త్యాగరాజ ఆరాదనోత్సవం

మునుపెన్నడూ జరగని విధంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎన్ ఎన్ ట్రస్టు చెర్మెన్ వాణి ఆధ్వర్యంలో ఓరుగల్లులో కన్నుల పండుగగా త్యాగరాజకీర్తనలు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి రాధాకృష్ణ గార్డెన్ వరకు మేళ తాలలతో, కోలాటాలు, డప్పు చప్పులతో త్యాగరాజస్వామి వారి నగర సంకీర్తన అట్టహాసంగా సాగింది. తదనంతరం రాధాకృష్ణ గార్డెన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఉత్సావాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఉత్సావాలని నిర్వహిస్తున్నామని, గతంలో సైతం కాకతీయ వారసులను తీసుకొచ్చి కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్నీ ఇంత గొప్పగా నిర్వహించడానికి ప్రోత్సహించిన భద్రకాళి శేషు అయ్యేగారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు విచ్చేసిన పండితులకు, కళాకారులకు, గాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement