Sunday, May 5, 2024

IPL | ఆరెంజ్ క్యాప్ రేసులో ప్లేయ‌ర్లు.. స్టేడియంలో ప‌రుగుల వ‌ద‌ర‌

ఐపీఎల్‌ 2023 16వ ఎడిషన్ ప్రారంభమై ఇప్పటికే నాలుగు రోజులు గ‌డిచాయి. ప్లేయర్ల పరుగుల వరద కూడా షురూ అయ్యింది. ఇండియన్ T20 లీగ్‌లో అత్యధిక రన్ స్కోరర్‌కు ఆరెంజ్ క్యాప్ బహుకరిస్తారు. ఈ క్రమంలో ఆరేంజ్‌ క్యాప్‌ కోసం ఆటగాళ్లు బ్యాట్‌కు పని చెబుతున్నారు. చెన్నైకి (చెన్నైసూపర్ కింగ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ రెండు హాఫ్ సెంచరీలతో 149 పరుగులు చేసి ప్రస్తుతం ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

ఆ తర్వాత లక్నో(లక్నో సూపర్ జేయింట్స్) తరఫున ఆడుతున్న విండీస్ ప్లేయర్ కైలీ మేర్స్‌ కూడా 210 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్థ సెంచరీలు చేసి 126 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ముంబయి ఇండియన్స్ కి ఆడుతున్న తిలక్ వర్మ 84, ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ 82 పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement