Friday, May 3, 2024

Manipur: ఆగ‌ని కాల్పులు… న‌లుగురు గ‌ల్లంతు …

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన గ‌త రాత్రి జరిగింది. గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాల్పులు జరగడానికి ముందు ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి.

ఇప్ప‌టికే 180 మంది మృతి… క‌ర్ఫ్యూలో ప‌లు గ్రామాలు..

అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అ‍ప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 180మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికీ మ‌ణిపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.. అలాగే బాధిత కుటుంబాల కోసం శ‌ర‌ణార్ధి శిబిరాలు కొన‌సాగిస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement