Monday, April 29, 2024

Train Accident | 290కు పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టేందుకు డీఎన్‌ఏ సేక‌ర‌ణ‌

జూన్‌ రెండవ తేదీన జరిగిన ఘోరమైన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 290కు చేరుకుందని అధికారులు తెలిపారు. రైలు ప్రమాదంలో గాయపడి కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరిన బీహార్‌ వాసి ప్రకాష్‌ రామ్‌ శుక్రవారం ఉదయం మరణించాడని చెప్పారు. బీహార్‌ వాసి మృతిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం ప్రకాష్‌ రామ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో భద్రపరిచిన 81 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మృతదేహాలు మావి అని చెప్పుకున్నవారు డీఎన్‌ఏ పరీక్ష నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం మొత్తంగా 78 కుటుంబాలు డీఎన్‌ఏ నమూనాలు ఇచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement