Monday, April 29, 2024

దేశంలో కేసులు తగ్గాయ్…మరణాలు మాత్రం అసలు తగ్గలే!!

దేశంలో క‌రోనా కేసులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మొన్నటివరకూ 24 గంటల్లో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు నమోదు అయ్యేవి. కానీ ఆదివారం ఎఫెక్ట్ కారణంగా భారీ స్థాయిలో తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 2,81,386 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో వైపు ఈ మహమ్మారి కారణంగా 4,106మంది చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. అలాగే 3,78,741మంది క‌రోనాను నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులుల సంఖ్య 2,49,65,463 కి చేరింది. అలాగే 2,11,74,076 మంది కరోనా ను జయించారు. ఇక ఇప్పటివరకు 2,74,390 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 35,16,997 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement