Friday, April 26, 2024

Breaking: స‌ముద్రంలో ప‌డ‌వ మునిగి.. 77 మంది మృతి

సముద్రంలో పడవ మునిగిపోవడంతో 77మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ సిరియా తీరంలో చోటుచేసుకున్నది. బతుకుతెరువు కోసం వెళ్తున్న‌ వలసదారుల పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. దీంతో 77 మంది మృతిచెందారు. తీవ్ర ఆర్థిక మాద్యంలో కూరుకుపోయిన లెబనాన్‌లో ఉపాధి కరువవడంతో అక్కడి ప్రజలు సిరియాకు సముద్రమార్గంలో అక్రమంగా వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో సిరియా సముద్ర తీరంలో వారి పడవ మునిగిపోయిందని, 77 మంది చనిపోయారని సిరియా ఆరోగ్య శాఖ మంత్రి హసన్‌ అల్‌ ఘబాశ్‌ తెలిపారు. ప్రమాదం సమ‌యంలో పడవలో సుమారు 150 మంది ఉన్నారని తెలిపారు. సామర్థ్యానికి మింది ప్రయాణికులు ఉండటంతోనే పడవ మునిగిపోయిందన్నారు. మరో 20 మందిని కాపాడామని.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement