Thursday, July 25, 2024

TG | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికి నిందితులుగా ఉన్న నలుగురు పోలీసులను అరెస్టు చేయగా.. నిందితులుగా మాత్రం ఆరుగురి పేర్లను చేర్చారు. అరెస్టు అయిన నలుగురిలో ఇప్పటి వరకు ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు, భుజంగరావు, తిరుపతన్నలు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును బుధవారం (జూన్ 12) వెల్లడించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement