Friday, April 26, 2024

కాశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన టెర్రరిస్టులు

బడ్గావ్‌: కాశ్మీరీ పండిట్‌లను లక్ష్యంగా చేసుకొని జమ్మ కాశ్మీర్‌లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. గురువారం నాడు బడ్గామ్‌ జిల్లా చదూర్‌ గ్రామంలోని తాలూకా కార్యాలయంలోకి జొరబడిని ఇద్దరు ఉగ్రవాదులు రాహుల్‌ భట్‌ అనే ఉద్యోగిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించారు.

చికిత్స అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. కాశ్మీరీ పండిట్‌లు, వలస కూలీలపై గత అక్టోబర్‌ నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన వారిపైనే ఈ దాడులు ఎక్కువగా సాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement