Friday, May 17, 2024

రాష్ట్రంలో ఉత్తర వాయువ్య జిల్లాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలకు పెరిగే అవకాశం : వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో ఉత్తర వాయువ్య జిల్లాల్లో ఈ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో ఈ వడగాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముందని తెలిపింది. తమిళనాడు వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి చత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతోందని దీంతో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement