Saturday, April 20, 2024

కర్నాటకపై సీడ‌బ్ల్యూసీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ‌.. తుంగభద్రపై ప్రాజెక్టులపై అభ్యంతరం

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో క‌ర్ణాట‌కపై సీడ‌బ్ల్యూసీ (కేంద్ర జ‌ల సంఘం)కు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కేంద్ర జ‌ల సంఘానికి బుధ‌వారం ఓ లేఖ రాశారు. తుంగ‌భ‌ద్ర‌పై క‌ర్ణాట‌క ప్రభుత్వం నిర్మిస్తున్న అప్ప‌ర్ తుంగ‌, అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాలంటూ ఆ లేఖలో తెలంగాణ కోరింది. కృష్ణా న‌ది నుంచి తుంగ‌భ‌ద్ర‌కు వ‌ర‌ద నీరు క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్రాజెక్టుల కార‌ణంగా దిగువ ప్రాంత‌మైన తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని తెలిపింది. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని కూడా తెలంగాణ గుర్తు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement