Monday, March 25, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ.434 కోట్ల విలువైన 62 కిలోల హెరాయిన్ సీజ్‌!

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ.434 కోట్ల విలువైన 62 కిలోల హెరాయిన్‌ను డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్స్‌లో మాద‌క ద్ర‌వ్యాల‌ను నింపి అధికారుల కండ్లు కప్పి దేశంలోకి త‌ర‌లించేందుకు డ్ర‌గ్ మాఫియా ఆగ‌డాల‌ను డీఆర్ఐ సిబ్బంది భ‌గ్నం చేసింది. భార‌త్‌లో కొరియ‌ర్‌, కార్గో, ఎయిర్ ప్యాసెంజ‌ర్ మార్గాల్లో హెరాయిన్‌ను భారీస్ధాయిలో సీజ్ చేయ‌డం ఇదే తొలిసార‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఈ దాడుల్లో రాబట్టిన స‌మాచారం ఆధారంగా పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లోనూ మ‌రో ఏడు కిలో హెరాయిన్ రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దు ప‌ట్టుబడింది. ప‌ట్టుబ‌డిన 62 కిలోల హెరాయిన్ విలువ మార్కెట్‌లో రూ 434 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక క‌న్‌సైన్‌మెంట్ దిగుమ‌తిదారును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement