తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ ఇవ్వాల సాయంత్రం ప్రమాదానికి గురయ్యారు. రాజస్థాన్లోని తానుమాతా టెంపుల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డు యాక్సిడెంట్లో గోవింద్ సింగ్ భార్య చనిపోయింది. కాగా, ఆయన ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటన స్పాట్లోనే గోవింద్ సింగ్ భార్య చనిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం ఉదయం 9:10 గంటలకు గోవింద్ సింగ్, ఆయన సతీమణి కలిసి 191 బెటాలియన్ నుంచి రాజస్థాన్లోని తనోత్ మాతా ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం రాంగఢ్కు తిరిగి వస్తుండగా, వారి కారు మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రమాదానికి గురైంది. గోవింద్ సింగ్, డ్రైవర్ను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గోవింద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి..
సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య మృతి పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.