Friday, April 26, 2024

కార్య‌క‌ర్తలకు అండ‌గా ఉంటా : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌టించారు. కొవ్వూరులో దివ్యాంగుడైన టీడీపీ పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీనివాస్ తో మాట్లాడేందుకు గాను చంద్రబాబు నేలపై కూర్చున్నాడు. ఆ కార్య‌క‌ర్త‌తో కాసేపు ముచ్చ‌టించాడు. అతని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్‍కు పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తామని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. దీంతో స్థానిక పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నెల‌కొంది. కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను అండ‌గా ఉంటాన‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement