Wednesday, May 15, 2024

హుజూరాబాద్ ట్రైల‌ర్ మాత్ర‌మే..అస‌లు సినిమా ముందుంది..’త‌రుణ్ చుగ్’..

సీఎం కేసీఆర్ పై విరుచుకుప‌డ్డారు బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగబోతోందని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర డప్పుల ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేసి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో తమ ప్రభుత్వం ఉందని సీఎం మిడిసిపడుతున్నారని.. వీరిపైన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement