Sunday, April 28, 2024

తనీష్ ‘మరో ప్రస్థానం’ ట్రైలర్ విడుదల

తనీష్ హీరోగా నటించిన ‘మరో ప్రస్థానం’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎమోషన్ హైలైట్ గా నిలవగా తనీష్ సీరియస్ ఇంటెన్స్ రోల్ ఆకట్టుకుంది. ఒక డెన్‌లో కంటిన్యూగా జరిగిన కథ ఇది. సన్నివేశాల్ని కెమెరా రికార్డ్ చేయడం కనిపిస్తోంది. రియల్ టైమ్ రీల్ టైమ్ ఒకటే కలిగి ఉన్న సినిమా ఇది. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే సరిగ్గా అదే టైమ్‌కు షో పూర్తవుతుంది.

ఈ మూవీలో తనీష్ సరసన ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ జానీ దర్శకత్వం వహించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో వరుడు మూవీ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement