Sunday, May 19, 2024

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళ సై..

పుదుచ్చేరి : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు.. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళిసై తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ వీపీ శివకోలందు, సీఎం నారాయణ స్వామి, ప్రతిపక్ష నేత రంగస్వామి హాజరయ్యారు. కొత్త ఎల్జీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement