Sunday, May 5, 2024

Tamilanadu – రెండు బస్సులు ఢీ – ఐదుగురి మృతి… 10 మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున తిరువత్తూర్ జిల్లా, వానియంబాడి హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలియవచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement