Sunday, April 28, 2024

Tamilanadu – కారు బోల్తా … అయిదుగురు మృతి..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. డివైడర్‌ అవతలి రోడ్డును దాటి సర్వీస్‌ రోడ్డుపై పడింది. విల్లాపురానికి చెందిన కనగవేల్ తన కుటుంబంతో కలిసి తలవాయిపురంలో ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మదురైలోని విలపురం ప్రాంతంలో నివాసం ఉంటున్నారని అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement