Wednesday, May 15, 2024

Tamil Nadu : వైద్యం కోసం వ‌చ్చి డాక్టర్ల‌నే అంత‌మొందించారు

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చి డాక్ట‌ర్ల‌నే అంత‌మొందించారు దుండగులు. ఈ ఘటన చెన్నైలోని తిరువళ్లూరులో చోటు చేసుకుంది.

- Advertisement -

వివరాల ప్రకారం.. తిరువళ్లూరుకు చెందిన నాయర్ ఆయుర్వేద డాక్టర్ కాగా, ప్రసన్న కుమారి రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్. అయితే, గుర్తు తెలియని దండగులు ఆయుర్వేద వైద్యం కోసం ఆదివారం నాయర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏం అయ్యిందో తెలియదు కానీ వైద్యం కోసం వచ్చిన దుండగులు డాక్టర్లు నాయర్, ప్రసన్న కుమారిని దారుణంగా నరికి చంపారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement