Tuesday, July 23, 2024

T20WC | ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ పై భారత్ విజ‌యం..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేటి జ‌రిగిన‌ దాయాదుల‌పోరులో భారత జట్టు విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు విఫ‌లమైంది.. అయితే ఆ తర్వాత డిఫెండింగ్‌లో రాణించింది. దీంతో 120 ప‌రుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక ఈ విజయంతో గ్రూప్-ఎలో ఉన్న టీమిండియా నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement