Monday, May 6, 2024

సుప్రీం తీర్పు ప్రమాదకరం.. ప్రతిపక్షాల ఆందోళ‌న‌

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంకు 2019లో చేసిన సవరణలను సమర్దిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని దాదాపు 17 ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ వంటి దర్యాప్తు సంస్థలకు అధిక అధికారాలను ఈ చట్టం కట్టబెడుతోందని ఆయా పార్టీలు ఆరోపించాయి. సవరించిన పీఎంఎల్‌ చట్టం ద్వారా ఈడీకి కల్పించిన విస్తృత అధికారాలు చెల్లుబాటుఅవుతాయని సుప్రీంకోర్టు జులై 27న తీర్పు చెప్పింది. దాదాపు 250 పిటిషన్లపై విచారణ జరిపి ఈ తీర్పు నిచ్చింది.

అరెస్ట్‌ చేసే అధికారం ఉండటం వల్ల ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందని పిటిషనర్లు చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.. ఈ తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరిస్తూ 17 ప్రతిపక్షాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్‌, టీఎంసీ, డిఎంకె, ఆమ్‌ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్‌వాది పార్టీ , ఆర్జేడీ తదితర పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement