Sunday, April 28, 2024

మోపిదేవీలో సుప్రీం కోర్టు జడ్జీ పూజలు..

మోపిదేవి, ప్రభన్యూస్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వీ.ఎన్ బట్టి ఆదివారం మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయంలోని నాగపుట్టలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వీ.ఎన్ బట్టి పాలు పోసి పూజలు చేశారు. స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థానం మర్యాద ప్రకారం అధికారులు ఘనంగా సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. న్యాయమూర్తి వెంట కృష్ణాజిల్లా కోర్టు న్యాయమూర్తి అరుణ సాహిత, హైకోర్టు విభాగాల రిజిస్ట్రార్లు ఉన్నారు. అవనిగడ్డ డీఎస్పీ పీ.మురళీధర్, అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement