Sunday, May 5, 2024

తెలంగాణలో 8 జిల్లాల విద్యార్థులకు సదావకాశం

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సబ్సిడీపై సోలార్ స్టడీ ల్యాంపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తొలుత 8 జిల్లాల విద్యార్థులకు వీటిని అందజేయాలని భావిస్తోంది. పెద్దపల్లి, వరంగల్(రూరల్), జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తొలుత స్టడీ ల్యాంపుల పంపిణీని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం భరించే 85% రాయితీ పోను రూ.70 మాత్రమే చెల్లించి ఏప్రిల్ 26లోగా విద్యార్థులు ఈ స్టడీ ల్యాంపులు పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement