Thursday, April 25, 2024

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షాత్కార వైభ‌వోత్సాలు-పోస్ట‌ర్ రిలీజ్ చేసిన జేఈవో వీర‌బ్ర‌హ్మం

వ‌చ్చే నెల 3వ తారీఖు నుంచి శ్రీనివాస‌మంగాపురంలో కొలువై ఉన్న శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షాత్కార వైభ‌వోత్సావాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల పోస్ట‌ర్ల‌ని జేఈవో వీర‌బ్ర‌హ్మం ఆవిష్క‌రించారు. మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి.కాగా టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.అనంత‌రం జేఈఓ మాట్లాడుతూ… జూలై 3 నుంచి 5 వరకు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా జూలై 3, 4, 5వ తేదీలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనుననారు. శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి జూలై 3న‌ పెద్దశేష వాహ‌నంపై, జూలై 4న హనుమంత వాహనంపై, జూలై 5న గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శన‌మిస్తారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఆల‌య ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement