Friday, May 3, 2024

8 నుంచి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు..

తిరుమల, ప్రభన్యూస్‌ : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలి క వ్యాధిగ్రస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్‌ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఏప్రిల్‌ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్‌ 8వ తేదీకి దర్శన టోకెన్లను వాయిదా వేశారు. రోజుకు వెయ్యి చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని దర్శనానికి అనుమతిస్తారు.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ పునరుద్ధరించనుంది. కాగా వీరికి ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో దివ్యాంగుల క్యూ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు స్లాట్‌ కేటాయించారు. ఈ విషయాన్ని గమనించి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు టికెట్లు బుక్‌చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement