Monday, April 29, 2024

ఏపీ, తెలంగాణ మ‌ధ్య‌ స్పెషల్‌ ట్రైన్స్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్‌ – లింగంపల్లి మధ్య స్పెషల్‌ రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది. ఆయా రైళ్లు సెప్టెంబర్‌ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాకినాడ టౌన్‌ – లింగంపల్లి (రైలు నం.07439) సెప్టెంబర్ ఒకటి నుంచి 14 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైలు కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది.

అలాగే లింగంపల్లి – కాకినాడ (07440) రైలు సెప్టెంబర్‌ 2 నుంచి 14 వరకు ప్రతి మంగళ, గురు, శనివారంల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో రైలు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనున్నది. రెండు మార్గాల్లో రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఆగుతాయని, ఆయా రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement