Thursday, April 25, 2024

సోనియా గాంధీకి మ‌ళ్లీ క‌రోనా.. ప్రియాంక‌కు కూడా పాజిటివ్‌..

కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి మ‌రోసారి క‌రోనా సోకింది. ఆమె ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసోలేష‌న్‌లో ఉన్నారు అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ శ‌నివారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డం ఇది రెండోసారి. గ‌తంలో జూన్ నెల‌లో ఆమె క‌రోనాతో బాధ‌ప‌డ్డారు. తీవ్ర‌మైన జ్వ‌రం, ఒళ్లునొప్పుల‌తో ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందారు. స‌ర్ గంగారాం ఆసుప‌త్ర‌లో జూన్ 12న చేరి జూన్ 20 వ‌ర‌కు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.

ప్రియాంక‌కు కూడా..
సోనియా గాంధీ కూతురు, కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. నాలుగు రోజుల క్రితం ఆమెకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement