Thursday, May 2, 2024

గాంధీ కుటుంబం సెంటిమెంట్ – ‘రైన్‌వారి’లో రెండు రోజ‌లు రాత్రి బస‌

జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ తాజాగా శ్రీనగర్‌లోని నైజీన్‌ సరస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇది కేవలం కుటుంబ పర్యటన మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కూడా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన.. కార్గిల్‌లో బహిరంగ ర్యాలీని పూర్తి చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి శ్రీనగర్‌కు చేరుకోనున్నారు. వారంతా రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో గడిపి అక్కడి నుంచి గుల్మార్గ్‌కు వెళతారు. గత కొన్నేళ్లుగా శ్రీనగర్‌లోని ‘రైన్‌వారి’ ప్రాంతంలోని ఓ హోటల్‌లో రెండు రాత్రులు నిద్ర చేయడం ఈ కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోంది. అయితే, ఈ సారి రాహుల్‌ గాంధీ నైజీన్‌ సరస్సులోని బోట్‌ హౌస్‌లో ఉంటారని సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం వారి సెంట్‌మెంట్‌ మేరకు పాత హోటల్‌లోనే బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement