Thursday, May 2, 2024

అమ‌రావ‌తి రైతుల‌కి కాంగ్రెస్ మ‌ద్ద‌తు..రైతులే దేశానికి వెన్నుముఖ‌..రేణుకా చౌదరి..

ఇబ్రహీంపట్నం : రింగ్ రోడ్డు వద్ద కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీకేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఘనస్వాగతం ప‌లికారు నేత‌లు. ఆమెని శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కాగా ఆమె మాట్లాడుతూ .. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నాన‌ని చెప్పారు.రైతులు దేశానికి వెన్నుముఖ‌ అన్నారు. అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోంది..అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని అన్నారు.నేను సైనికుడి కూతురిని…దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా…నాకు భయం అంటే ఏంటో తెలియదన్నారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుందన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘం..మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావు,విష్ణు చక్రాలని తెలిపారు. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి మ‌హిళ‌లు బుద్ధి చెబుతార‌న్నారు. ఏపీ ప్రభుత్వం రైతులు రోడ్డెక్కే పరిస్థులు తీసుకువచ్చిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాటి మహిళలుగా నాకు బొట్టుపెట్టేందుకు మహిళలు వస్తే పోలీసులు అడ్డుకోవడం మంచి పద్దతికాదన్నారు.రేణుకా చౌదరి అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement