Friday, May 3, 2024

Social Media sensation kid: ‘గద్వాల్ రెడ్డి బిడ్డ’ మృతి

సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచ‌ల‌నం సృష్టించిన ‘గద్వాల్ రెడ్డి బిడ్డ’ అలియాస్ మ‌ల్లికార్జున్ రెడ్డి ఆదివారం మృతి చెందాడు. అనారోగ్య స‌మ‌స్య‌లు గద్వాల రెడ్డిబిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి ప్రాణాలు తీశాయి.. చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆ బుడ‌త‌డు ఆదివారం మృతిచెందాడు. స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని కటుంబసభ్యులు తెలిపారు.

‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల్ రెడ్డి బిడ్డ..’ అంటూ మల్లికార్జున్ చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. కొన్ని వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి రావ‌డంతో చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఆ త‌ర్వాత మ‌రికొన్ని వీడియోల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement