Sunday, April 28, 2024

Sitara – తండ్రి బాట‌లో త‌న‌య – తొలిపారితోషికాన్ని స్వ‌చ్చంద సంస్థ‌కు విరాళం

మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార పీఎంజే జ్యువెలర్స్ యాడ్లో న‌టించింది.. ఈ యాడ్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది.. ఇందులో న‌టించినందుకు దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇదే యాడ్ కు సంబంధించి నమ్రతతో కలిసి సితార హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చింది.

ఇక మీడియాతో ఇంటరాక్షన్ చేస్తున్న సమయంలో ఈ మొదటి యాడ్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారా? లేక మీ తండ్రి మహేష్ కి ఇచ్చారా? తల్లి నమ్రతకు ఇచ్చారా? అని అడిగితే సితార ఆసక్తికరంగా తాను చారిటీకి ఇచ్చానని కామెంట్ చేసింది. నిజానికి మహేష్ బాబు కూడా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ సర్వీస్ చేస్తున్నారు. తాను బిజీగా ఉన్నా సరే నమ్రత ఆ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిపి ఇప్పటివరకు దాదాపు 1,000 మంది చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు మహేష్ బాటలోనే సితార కూడా తనకు కోటి రూపాయలు వస్తే వాటిని ఏవో కొనుక్కోవాలని ఆశపడకుండా చారిటీకి ఇవ్వడం గర్వించవలిసిన విషయం అని మహేష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సరైన పెంపకం పెంచితే ఇలానే మంచి బుద్ధులు అలవడతాయి అంటూ వారంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement