Friday, May 17, 2024

అమెరికాలో మళ్లీ కాల్పులు.. భారతీయుడి మృతి

అమెరికా తుపాకీ తూటాల‌తో మారుమోగుతోంది. గ‌డిచిన ఏడాదిలో తుపాకీ తూటాకు ఎంతో మంది బ‌ల‌య్యారు. చ‌ర్చీలు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌నాల‌పై కాల్పుల‌కు పాల్ప‌డుతున్నారు దుండ‌గులు. అమెరికా ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కాల్పులు మాత్రం ఆగ‌డం లేదు. అయితే క్వీన్స్ లో సత్నామ్ సింగ్ (31) అనే భారత సంతతి వ్యక్తిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఇక్కడి సౌత్ ఓజోన్ పార్క్ వద్ద అద్దె కారులో కూర్చుని ఉండగా, ఓ సాయుధుడు సత్నామ్ సింగ్ పై కాల్పులు జరిపాడు. ఛాతీ, మెడపై బుల్లెట్ గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింగ్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే దుండగుడు సత్నామ్ సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నాడా? లేక, సత్నామ్ సింగ్ అద్దెకు తీసుకున్న కారు యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసు విభాగం డిటెక్టివ్ లు పరిశోధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement