Monday, April 29, 2024

Shock to Congress – ఛత్తీస్ గఢ్‌లో బీజేపీ పాగా…కాంగ్రెస్ కు శృంగభంగం…

చతీస్ గడ్ లో బిజెపి అధికారపీఠం వైపు దూసుకువెళుతున్నది.. ప్రస్తుత అధికారపీఠంపై ఉన్న కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది.. ఇక్కడి ఫలితాలు ఎగ్జిట్ పోల్ కు భిన్నంగా వ‌చ్చాయి.. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కైవసం చేసుకోవాలి. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాల కంటే కూడా ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 56 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉండగా.. కాంగ్రెస్ 32 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నారు. 2018లో కాంగ్రెస్ 71, బీజేపీ 14, సీట్లను గెలుచుకున్నాయి. తాజా ఎన్నిక‌ల‌లో బిజెపి ఇక్క‌డ పాగా వేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement