Friday, April 26, 2024

మత హింసను ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు.. కేంద్రానికి విపక్షాల విజ్ఞప్తి

మత హింసను ప్రేరేపించే వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్​ను కాంగ్రెస్​, ఎన్​సీపీ ప్రతిపాదించగా 13 విపక్ష పార్టీలు సమర్థించాయి. కానీ, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న శివసేన మాత్రం దీన్ని వ్యతిరేకించింది. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని.. మత హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్, ఎన్‌సిపి రెండూ సంతకాలు చేశాయి. సోనియా గాంధీ ప్రారంభించిన ఈ లేఖ ఇటీవలి మత హింసపై ప్రధాని మోడీ మౌనం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో ద్వేషపూరిత ప్రసంగాలకు అధికారిక ప్రోత్సాహం లభిస్తున్నదని ఆరోపించింది. మత హింసను ప్రేరేపించే సాయుధ మతపరమైన ఊరేగింపుల పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

మసీదుల నుండి లౌడ్‌స్పీకర్‌లను తొలగించాలనే డిమాండ్‌తో సహా అనేక సమస్యలపై ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న శివసేన, పార్టీ బహిరంగంగా ఈ సెక్యులర్ బ్లాక్‌లో భాగమైతే, ఈ డిమాండ్లు ఊపందుకుంటాయని.. దాని హిందూత్వ ఇమేజ్‌తో సమస్యలను సృష్టించవచ్చని భావిస్తోంది. కాగా,  కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, జేకేఎన్‌సీ తదితర పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై విమర్శలు గుప్పించాయి.

మతోన్మాదాన్ని ప్రచారం చేసే వారి మాటలు, చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయిన ప్రధాని మౌనంగా ఉండటం.. వారి మాటలు, చర్యల ద్వారా సమాజాన్ని రెచ్చగొట్టడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులు అధికారిక ప్రోత్సాహం యొక్క విలాసాన్ని అనుభవిస్తున్నాయి అనడానికి ఈ నిశ్శబ్దం ఒక స్పష్టమైన సాక్ష్యంగా వారు చెబుతన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement