Wednesday, May 1, 2024

Exclusive | భార్యను, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి.. ఏసీపీ ఆత్మహత్య!

మహారాష్ట్రలోని పూణె సిటీలో దారుణం జరిగింది.  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) సోమవారం తన భార్యతో పాటు తన మేనల్లుడుని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవ్వాల (సోమవారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగినప్పటికీ బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. ఏసీపీ భరత్ గైక్వాడ్ బంగ్లా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన వెనుక కారణాన్ని ఇంకా కనుగొనలేదని చతుర్‌శృంగి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గైక్వాడ్ అమరావతిలో నియమితులయ్యారు.ఇంటికి తిరిగి వచ్చారు. సోమవారం తెల్లవారుజామున ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్చాడు.. ఈ కాల్పులు జరిగిన వెంటనే, అతని మేనల్లుడు, కొడుకు తలుపు తెరిచి ఏం జరిగిందో చూడటానికి పరిగెత్తారు. తలుపు తెరవగానే, ఏసీపీ తన మేనల్లుడు ఛాతీపై కూడా కాల్పులు జరిపాడు.  తర్వాత గైక్వాడ్ తన తలపై కాల్చుకుని చనిపోయాడు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.  అని పోలీసులు  తెలిపారు. మృతుడి భార్య మోని గైక్వాడ్‌గా, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement