Monday, April 29, 2024

Breaking | ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు.. నెక్కొండలో దారుణం!

న‌ర్సంపేట‌ (ప్రభన్యూస్​): వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తండాలో ఆడ శిశువు అమ్మకం జరిగినట్లు అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అనూష, స్వామి దంపతులు గత నెల 20వ తేదీన ప్రసవం కోసం వరంగల్ కేంద్రంలో సి కె ఎం ఆసుపత్రిలో చేరారు. ఆ దంపతులకు 24వ తేదీన ఆడ బిడ్డ పుట్టినట్లు తెలిపారు. ఇదివరకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉండటంతో పుట్టిన ఆడ శిశువును పక్కనే చికిత్స కోసం వచ్చిన వారికి 50వేలకు ఆమ్మినట్లు అధికారుల పరిశీలినలో తేలింది. ఈ విషయాన్ని 28వ తేదీన అంగన్వాడీ కార్యకర్త విచారణ జరిపడంతో ఈ విషయం బయటపడింది. కాగా, సోమవారం ఉన్నతాధికారుల ముందు విక్రయించిన వారిని హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement